జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ రఘువీర్ విష్ణు


ఏలూరు/భీమవరం: జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం భీమవరం డివిజన్‌కు నూతనంగా నియమితులైన డీఎస్పీ రఘువీర్ విష్ణు జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీఎస్పీ రఘువీర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ భేటీలో డీఎస్పీ రఘువీర్ కొద్దిసేపు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతూ భీమవరం డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేయడం, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోనున్న చర్యలపై వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న ఒక నెల రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొననున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలుగా నిఘా పెంచి శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. లా అండ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఎస్పీకి దిశానిర్దేశం చేశారు.